జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ 100% కలెక్టర్ జె.నివాస్


Ens Balu
2
Srikakulam
2020-07-31 11:40:35

శ్రీకాకుళం జిల్లాలో2020-21 విద్యాసంవత్సరం కు సంబం ధిం చి అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కా ర్పొరేట్ స్కూల్స్ లో 100 శాతం రాయితీ కల్పిస్తూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఉత్తర్వులు జారీచేశారని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ర్ట కార్యదర్శి శాసపు జోగినాయుడు తెలిపారు. ప్రతీ ఏటా జర్నలిస్టుల పిల్లల చదువుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసికొనని రాయితీలు కల్పిస్తూ సహాయపడుతున్న కలెక్టర్ ను జర్నలిస్టుల సంఘాల ఐక్యవేధిక జర్నలిస్టులు అభినందించారు. ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాల విధిగా జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం రాయితీ ఇవ్వాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడం శుభపరిణామం అన్నారు. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ, ప్రతీ ఒక్కరూ మెలగాలని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అక్రిడేషన్ కలిగిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించే సమయంలో కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు కాపీ సమర్పించాలని శాసపుజోగినైడు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, డెస్క్ జర్నలిస్టులు, చిన్న,మధ్యతరహా పత్రికల ప్రతినిధులు ఈ సర్కులర్ పై ఎటువంటి సందేహాలు ఉన్నా జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యా శాఖ అధికారులను జర్నలిస్టుల ఐక్యవేధిక ప్రతినిధులు కొంఖ్యాన వేణుగోపాల్,అల్లు యుగంధర్,ఎం.ఏ. వి.సత్యనారాయణ, డోల అప్పన్న,చింతపల్లి నాగబాబు ,సూరి చంద్రశేఖర్,రౌతు సూర్యనారాయణలు మీడియాతో మాట్లాడిన వారిలో ఉన్నారు.