హమ్మయ్య పందులను పట్టుకున్నారు..
Ens Balu
2
s.rayavaram
2020-12-05 11:41:58
విశాఖపట్నం జిల్లా, యస్.రాయవరంలో గ్రామసచివాలయ సిబ్బంది గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నపందులను పట్టుకున్నారు. మొత్తం 15 పందులను పట్టుకొని సచివాలయంలో బందించారు. అప్పటి వరకూ పందులను గ్రామానికి దూరంగా పెట్టాలని చెప్పినా వినని పందుల పెంపకం దారులు పందులను పట్టుకోగానే సచివాలయానికి తరలి వచ్చారు. గ్రామానికి దూరంగా పందులను పెంచితే తప్పా వాటిని వదిలిపెట్టేది లేదని గ్రాసచివాలయ సిబ్బంది తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పందులను పట్టుకొని సచివాలయంలో పెట్టామన్నారు. సచివాలయ పరంగా శానిటేషన్ సిబ్బంది ఎంత శుభ్రం చేసినా పందుల వలన మొత్తం అంతా చెత్తగా మారుతోందని అన్నారు. అధికారుల సూచనల మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకొని, వాటిని విడిచిపెట్టాలా, లేదంటే గ్రామశివారు పెంచుకుంటానంటే వదిలిపెట్టాలనే విషయమై చర్యలు తీసుకుంటామని చెప్పారు.