జనగనన్న చేయూతకి ఊర్లో ఉన్నోడు అనర్హుడు..


Ens Balu
2
s.rayavaram
2020-12-06 19:15:01

అధికారులు తలచుకుంటే గ్రామంలో లేని వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తారు..ఏంటి లేని వ్యక్తి ఎలా అందిస్తున్నారని డౌట్ పడుతున్నారా అలా అయితే మీరు ఒక్క విశాఖజిల్లా, ఎస్.రాయవరం మండల కేంద్రానికి వస్తే..ఇక్కడి సచివాలయ సిబ్బంది చేసే చేతి వాటం ఎలావుంటో మీకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించాలని నెత్తీనోరూ కొట్టుకుంటే ఇక్కడి గ్రామసచివాలయ సిబ్బంది మాత్రం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ గ్రామంలో లేని వారికి కూడా పథకాలు కట్టబెట్టి వారి పనితనాన్ని ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారు. ఎస్.రాయవరం గ్రామంలో 'జగనన్న చేయూత పథకం' అభాసు పాలవుతున్నదని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఒక వర్గం వారికి చేయూత పథకంలో 'చేయి'చ్చి మిగిలిన వారికి రిక్త హస్తం చూపించడం చూస్తే అధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.  గ్రామంలో 24 మంది రజక వృత్తి ఉండగా, ఈ పథకం కోసం 20 దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన 17 మందికి  పథకాన్ని మంజూరు చేశారు. అయితే వీరిలో చీపురుపల్లి చక్రరావు, బొంబూరి నారాయణరావు, బొంబూరి రాము ముగ్గురికి ఇస్త్రీ బడ్డీలు లేవంటూ దరఖాస్తులను తిరస్కరించారు. వాస్తవం గా చేయూత పథకం మంజూరైన 17 మందిలో 6 గురికి మాత్రమే ఇస్త్రీ బడ్డీలు ఉన్నాయి. మిగిలిన 11 మందికి ఎటువంటి బడ్డీలు లేకపోగా, ఈ 11 మందిలో 4 గురికి పెంన్షన్లు కూడా అందుతున్నాయి. 'వడ్డించేవాడు మనవాడైతే బంతి చివరన కూర్చున్నా విస్తరి నిండుతుందన్నట్టు'గా బొంబూరి శంకర్ అనే వ్వక్తి హైదరాబాద్ లోనూ, చీపురుపల్లి నాగు విజయవాడలో ఉన్నప్పటికీ వారికి పథకాలు మంజూరు చేశారు. దీనిని బట్టి చూస్తే జిల్లా అధికారుల అదేశాలు ఎస్.రాయవరం మండల కేంద్రంలో ఏ స్థాయిలో అమలు జరుగుతున్నాయో అర్ధమవుతుంది. టీషాపు నడుపుకుంటున్న బొంబూరి సత్యనారాయణ, మాంసం దుకా ణం నిర్వహిస్తున్న అడ్డురి పెంటయ్య వీరిరువురకు మంజూరు చేశారు. ఇదే గ్రామంలో ఉంటూ కుల వృతి చేసుకుంటున్న ముగ్గురికి పథకానికి అనర్హులుగా తిరస్కరించడం చర్చనీయాంశం అవుతుంది. ఇదే విషయమై గ్రామ సచివాలయ కార్యదర్శికి గత నెల 24 వ తేదీన చీపురుపల్లి చక్రరావు పిర్యాదు కూడా చేశారు. ఒక వర్గానికి చెందిన వక్తులుగా భావించి తమకు అన్యాయం చేశారని, ఇందుకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే బి.సి.కార్పొరేషన్ అధికారితోపాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు బాధితులు మీడియాకి వివరించారు. 
సిఫార్సు