అన్నవరంలో వైభవంగా కార్తీక దీపోత్సవం..
Ens Balu
2
Annavaram
2020-12-07 20:58:42
అన్నవరంలోని శ్రీనూకాలమ్మ అమ్మవారి ప్రాంగణలంలో వెలసిన శ్రీ పరమశివుడి విగ్రహం వద్ద కార్తీక దీపోత్సవం ఎంతో వైభవంగా సాగింది. శివలింగ నమూనాతో చేసిన ఆకారంలో రెండువేల దీపాలతో శివయ్యకు దీపాలతో భక్తులు పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త గంగరాజు నేత్రుత్వంలోని ఆలయ కమిటీ కార్తీకమాసం చివరి వారం కావడంతో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాయంత్రం ఆరు గంటల నుంచే భక్తులు విశేషంగా తరలి వచ్చి దీపాలు వెలిగించి శివుడికి పూజలు చేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగానికి పాలాభిషేకం చేసుకునే సౌలభ్యం కూడా కల్పించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోనే ఉచిరిచెట్టు, బిల్వ దలాల చెట్లు ఉండటంతో నాలుగు వారాలుగా భక్తులు విశేషంగా తరలి వచ్చి కార్తీక పూజలు జరుపుకున్నారు. ఆఖరిరోజు వైభవంగా జరిగిన కార్తీక దీపోత్సవ వెలుగులో శివయ్య దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులు దర్శనమిచ్చారు.