అర్హులమైనా మాకు కాపు నేస్తం అమలు కాలేదు..


Ens Balu
3
s.rayavaram
2020-12-18 21:28:53

విశాఖపట్నం జిల్లా,  ఎస్.రాయవరం మండలం, సైతారుపేట కు చెందిన మహిళలు కాపు నేస్తం తమకు వర్తింపజేయాలని కోరుతూ ఎంపీడీఓకి స్పందనలో ఫిర్యాదు చేశారు. ఆ పథకానికి  అన్నివిధాలా తాము అర్హులమైనా ఈ పథకం తమకు మంజూరు కాలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, కాపునేస్తం పథకానికి మోటూరు గోవిందమ్మ, నాగమణి, గొన్నాబత్తుల పద్మ, వరలక్ష్మి, కామేశ్వరి,మంగతల్లి సమ్మంగి పద్మ, రావి నాగమణిలు దరఖాస్తు చేసినా ఆ పథకం తమకు వర్తించేయలేదున్నారు.  గ్రామంలో 7 ఎకరాలు భూమి ఉన్న మహిళకు మంజూరు చేసిన అధికారులు తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపించారు. 29.07.2020 ఈ విషయం పై ఎం.పి.డి.ఓ కు పిర్యాదు చేసినా ఇప్పటి వరకూ తమకు న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో అందరికీ పథకం వర్తింపజేశారని తమను మాత్రం వదిలేశారని చెప్పారు. అంతేకాకుండా గ్రామ సచివాలయ కార్యదర్శిని ఎన్నిసార్లు అడిగినా మీకూ పథకం వస్తుందని చెబుతున్నారని కానీ అందరికీ వచ్చిన పథకం తమకు మాత్రం రాలేదని మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు అధికారులు, సచివాలయ సిబ్బంది చేసిన అన్యాయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి అర్హులమైన తమకు కూడా పథకం వర్తింపచేయాలని బాధితులు కోరుతున్నారు. 
సిఫార్సు