గొలుగొండ మండలంలో 132 కేజీల గంజాయి స్వాధీనం..
Ens Balu
3
Golugonda
2020-08-10 09:24:21
విశాఖ జిల్లా, గొలుగొండ మండలం గుమ్మాల వద్ద పోలీసులు సో మవారం 132 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వ హిస్తుం డగా పాకలపాడు నుంచి గుమ్మాల వైపు వస్తున్న కారులో లోడ్ చేసిన 132 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈకేసులో రాజ మండ్రి ప్రాంతానికి చెందిన కొవ్వూరు రమేశ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చింతపల్లి మండలం అన్నవరం నుంచి ఈ గంజాయిని కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్సై నారాయణరావు మీడియాకి వివరించారు. సంఘవిద్రోహ చర్యలకి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.