జెడ్పీలో 12 మందికి కారుణ్య నియామకాలు..
Ens Balu
7
2020-12-29 11:30:24
విజయనగరం జిల్లాలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారంతా అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. మంగళవారం జిల్లా పరిషత్లో 12 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగులు మరణించిన అనంతరం వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే మానవతా ద్రుక్పదంతో కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టామని వివరించారు. నియామకాలు పొందిన వారిలో నలుగురిని జూనియర్ అసిస్టెంట్లుగా, ఒకరిని టైపిస్ట్గా, ఏడుగురిని ఆఫీస్ సబార్డినేట్స్గా నియమించారు. అంతేకాకుండా మిగిలిన కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా తక్షణమే శాఖాపరమైన పనులు పూర్తిచేసి వారికి కూడా నియమాకాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.