ప్రతీ నిరుపేదకు సొంతిల్లే ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
2
Ravikamatham
2020-12-29 17:26:55

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ  రావికమతం మండలం గొంప , మరల పాక , గుడివాడ, తట్టబంధ, గుడ్డిప, తోటకూర పాలెం గ్రామపంచాయతీలలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. మండల తాసిల్దార్ పీ కనకారావు, రెవిన్యూ అధికారులు మరియు సిబ్బంది హాజరయ్యారు. అనంతరం శాసనసభ్యులు ధర్మశ్రీ రోలుగుంట మండలం ఏపీ అగ్రహారం , జానకి రాంపురం, కుసర్ల పూడి గ్రామ పంచాయతీలకు చెందిన  లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ గావించారు. మండల తాసిల్దార్ కృష్ణమూర్తి ఇతర రెవిన్యూ సిబ్బంది హాజరయ్యారు.
సిఫార్సు