కిషోర్ ను వాళ్లే చంపేశారంటూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన
Ens Balu
4
Narsipatnam
2020-08-11 13:51:10
కిషోర్ చావుకు కారణమైన కానిస్టేబుల్ ను తక్షణమే సస్పెండ్ చేసి, ఆ కుటుంబాన్ని అరెస్టు చేయాలని నర్పీట్నం పోలీసుస్టేషన్ బయట రోడ్డుపై మృతుడి తల్లిదండ్రులు మంగళవారం ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి మద్దతుగా కాలనీ వాసులంతా కలసిరోడ్డుపైకి వచ్చారు. నర్సీపట్నం పెద్దచెరువులో రగ్గుచుట్టి దొరికిన మృతదేహాం నర్సీపట్నం యస్.సి కాలనీకి చెందిన గారా కిషోర్ గా గుర్తించారు. కిషోర్ నర్సీపట్నం పోలీసు స్టేషన్లో పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అందువల్లే కిషోర్ ను అమ్మాయి తల్లిదండ్రులే చంపేసి ఉంటారని ఆరోపించారు. రెండేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, దీని నుంచి వదిలించుకునేందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పట్టణ సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ కిషోర్ తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని చెప్పారు.