ప్రతీ నిరుపేదకి నవరత్నాలు అందజేస్తాం..


Ens Balu
2
Payakaraopeta
2020-12-30 21:05:37

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా   బుధవారం పాయకరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గొల్ల బాబురావు నక్కపల్లి మండలం వేంపాడు, నెల్లిపూడి, డి ఎల్ పురం, గునుపూడి , బంగారమ్మ పేట, గ్రామపంచాయతీలు,  పాయకరావుపేట మండలం నమ్మ వరం , సీతారాంపురం, గుంటపల్లి గ్రామ పంచాయతీలలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కొరకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని, అంతేకాకుండా ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు.            నక్కపల్లి, పాయకరావుపేట   మండల తాసిల్దార్ లు వి వి రమణ, పి అంబేద్కర్, రెవిన్యూఅధికారులు ,సిబ్బందిహాజరయ్యారు.
సిఫార్సు