జనవరి 7లోగా పట్టాల పంపిణీ జరగాలి..


Ens Balu
2
Allavaram
2020-12-30 21:38:30

తూర్పుగోదావరి జిల్లాలో జనవరి 7 వ తేదీ లోపు అల్లవరం మండలంలోని అన్ని గ్రామాల నిరుపేద లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయాలని  అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ అధికారులను ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్ అల్లవరం మండలం గోడి గ్రామంలో 115 మంది లబ్ధిదారుల కొరకు సిద్ధం చేస్తున్న 3 ఎకరాల 83 సెంట్లు ఇండ్ల స్థలాన్ని,అలాగే అల్లవరం మండల ప్రధాన కేంద్రం లో 192 మంది లబ్ధిదారులకు పంపిణీ నిమిత్తం సిద్ధం చేస్తున్న 4 ఎకరాల 52 సెంట్ల  స్థలాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ, ,దీనిని దృష్టి లో వుంచుకొని అధికారులు ఇండ్ల స్థలాల కు సంభందించి మిగిలి వున్న పనులు అన్నిటినీ సత్వరం పూర్తి చేయాలని,  లబ్ధిదారుల కొరకు గుర్తించిన ఇండ్ల స్థలాల లో ఎక్కడైనా మెరక చేయవలసివున్నా,రెడ్ గ్రావెల్  వేయవలసి వున్నా,ఇంటర్నల్ రహదారులు తదితర చేయవలసిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 7 వతేది లోపు పంపిణీకి సిద్దం చేయాలని అల్లవరం మండల పరిషత్ అభివృద్ది అధికారి రాఘవులును,అలాగే ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. అసిస్టెంట్  ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్ ను సబ్ కలెక్టర్ ఆదేశించారు.సబ్ కలెక్టర్ వెంట ఎం.పి.డి.ఓ రాఘవులు,మండల తహసీల్దార్ అప్పారావు, ఏ.పి.ఓ. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు