అన్ని ప్రాంతాలు సమాన అభివ్రుద్ధి..


Ens Balu
2
Simhachalam
2021-01-01 17:03:21

విశాఖలో అన్ని నియోజకవర్గాలను పూర్తిస్థాయిలో అభివ్రుద్ధి చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం సింహచలంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. కోటి యాబై ఐదు లక్షలతో నిర్మించనున్న  సామాజిక భవనం, సీసీ రోడ్లు, సీసీ కాలువలు శంకుస్థాపన చేశారు. అనంతరం పేదలందరికి ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాలను అందచేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విశాఖను అంతర్జాతీయ స్థాయిలో అభివ్రుద్ధిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషం గా ఉండాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.  2020 సంవత్సరంలో ఎదురైన కరోనా మహమ్మారి,  విపత్తులను  అధికమించి దైర్యంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని  దేశంలోనే ఆదర్శం రాష్ట్రముగా తీర్చి దిద్దిన ఘనత ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
సిఫార్సు