ప్రభుత్వ భవనాలు తక్షణమే పూర్తిచేయాలి..


Ens Balu
3
Gudibanda
2021-01-02 19:14:52

అనంతపురం జిల్లాలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం గుడిబండ మండలం లోని మోరుబాగల్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా గ్రామసచివాలయ, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు వేగంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మహబూబ్ పీరా, ఎంపీడీవో నాగేంద్ర కుమార్, పలువురు అధికారులు, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు