సింహాద్రినాధుడి స్వర్ణకవచం బహుకరణ..
Ens Balu
10
Simhachalam
2021-01-08 13:38:53
విశాఖలోని సింహాచలం శ్రీవరాహాలక్ష్మీనృసింహస్వామివారికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు, అప్పన్న చందనోత్సవ కమిటీ మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు దంపతులు అపురూపమైన కవచాన్ని విరాళంగా అందజేశారు. దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 27 కేజీల ఇత్తడి కవచం ఆలయ వర్గాలకు అందజేశారు . ఈ కవచం సింహాద్రినాధుడి స్వర్ణకవచం అలంకరణకు వినియోగించనున్నారు. ఈ సందర్భంగా దాత గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సింహాచలం ప్రాంతంలో జన్మించడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. గతంలో కూడా అప్పన్న నిత్యన్నధాన పథకానికి తాను రూ .3 లక్షలు విరాళంగా అందజేయడంతో పాటు తమ కుటుంబ సభ్యులు మరికొంత మొత్తాన్ని అందజేశారని తెలిపారు. అంతే కాకుండా స్వర్ణ పుష్పాలు, స్వర్ణ తులసీదళాలు కూడా తాము విరాళంగా అందజేశామన్నారు. తాజాగా స్వర్ణ కవచ అలంకరణకు అవసరమైన ఇత్తడి కవచం అందజేసే అదృష్టం లభించిందన్నారు. ఆలయ ఏఇఓ రాఘవకుమార్ కు ఈ కానుకను శ్రీనిబాబు దంపతులు అందజేశారు. తొలుత ఇత్తడి కవచంకు ఆలయ అర్చకలు సింహాచల ఆచార్యులు , పెద్దిరాజు తదితరులంతా స్వామివారి పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో శిల్పి పండూరి అయ్యప్ప , పండూరి సాంబ , నాయుడు పాల్గొన్నారు. అంతకు ముందు దాత కుటుంబ సభ్యులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.