పాడేరు లో 3రోజులు కరోనా పరీక్షలు..


Ens Balu
3
Awantipora
2020-08-12 18:22:43

పాడేరు పీహెచ్సీ పరిధిలోని కరోనా లక్షణాలతో ఉన్న రోగులకు ప్రతి సోమవారం, గురువారం , శనివారం సంజీవిని వాహినం ద్వార జి.యం.ఆర్ పాలిటెక్నిక్ పాడేరు గ్రౌండ్ వద్ద కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు  అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. కే లీలప్రసాద్  తెలియజేశారు. ఈ పరీక్షలను నోడల్ అధికారి డా. ప్రవీణ్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. పాడేరు డివిజన్ పరిధిలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున ముందస్తుగా  కరోనా నిర్ధారణకాబడిన రోగుల ప్రధమ కాంటాక్ట్స్, సెకండరి కాంటాక్ట్స్, కరోనా సింటోమేటిక్ కాంటాక్ట్స్ గలవారికి కరోనా నిర్ధారణ  కిట్ల లభ్యతను అనుసరించి పరీక్షలు చేస్తున్నామన్నారు. ఈ కార్యాక్రమంలో  కోవిడ్ కేర్ సెంటర్ వై.టి.సి పాడేరు నోడల్ అధికారి డా. ప్రవీణ్ వర్మ  తదితరులు పాల్గున్నారు.