కార్మికులకు దుస్తులు వితరణ చేసిన కొండబాబు..
Ens Balu
2
s.rayavaram
2021-01-10 18:47:15
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ఏర్పాటు చేసిన గ్రామసచివాలయాల ద్వారా అధికారులు, సిబ్బంది ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగి వెలగా కొండబాబు కోరారు. ఆదివారం ఎస్.రాయవరంలో వీరి షష్టిపూర్తి సందర్భంగా గ్రామసచివాలయంలోని పంచాయతీ కార్మికులకు, రిక్షా కార్మికులు, నాయా బ్రాహ్మణులకు ఆమె కుమార్తె సాయిసౌజన్య ద్వారా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి సహకారం లేని వారికి తమవంతు సాయంగా ఈ చిన్ని దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కర్రి వెంకటేశ్వరరావు మాస్టారు, సుబ్బరాజు,వెలగా గోపాలకృష్ణ, కుటుంబసభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యుడు కొండబాబు కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు.