అవినీతి రుజువైనా ఈఓపీఆర్డీపై చర్యలు శూన్యం..
Ens Balu
2
s.rayavaram
2021-01-10 19:33:06
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ శాఖలోని ఉద్యోగం చేస్తున్నారా అయితే మీరు అడ్డగోలుగా దోచేసుకోవచ్చు.. ఒక వేళ మీ ఉద్యోగం ఏ గ్రామసచివాలయానికో కార్యదర్శో, ఈఓపీఆర్డీ అయితే మరీ మంచిది.. సచివాలయంలో ప్రజల సేవల పేరుతో చేసిన ఖర్చును అక్రమంగా మీ కుటుంబ సభ్యుల ఖాతాలకు దారి మళ్లించేయొచ్చు.. ఏంటీ విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.. అవును మీరు చదువుతున్నది అక్షర సత్యం.. విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలంలోని గ్రామసచివాలయాల్లో జరిగిన లక్షల రూపాయల అవినీతి బాగోతాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక యాప్ ఈఎన్ఎ లైవ్ ద్వారా ఆధారాలతో సహా ప్రత్యేక కధనాలతో బయట పెట్టింది. ఇక్కడ ఈఓపీఆర్డీగా పనిచేన యడ్లపల్లి త్రిమూర్తులు, మరో ఇద్దరు గ్రామసచివాలయ కార్యదర్శిలు.. సచివాలయాలకు చెందిన సుమారు పది లక్షల రూపాయలును వారి కుటుంబ సభ్యుల ఖాతాలోకి దారిమళ్లించుకున్నారు.. వాటిని ఆధారాలు, బ్యాంకు ఖాతాలతో సహా బయటపెట్టడంతో.. ఈఎన్ఎస్ వార్తా కధనాలతో సహా వీరిపై గొలుగొండ మండలం క్రిష్ణదేవిపేటకు చెందిన ఒక వ్యక్తి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు చేసేంత వరకూ పంచాయతీరాజ్ శాఖలోని ఏ ఒక్క అధికారి ఈ అడ్డగోలుగా మేసేసిన నిధుల వ్యవహారం పై పర్యవేక్షణ చేయలేదు సరికదా..విషయం తెలిసినా మిన్నకుండిపోయారు.. ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో వరసు కధనాలు రావడంతో జిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారి నర్సీపట్నం డిఎల్పీఓను విచారణ అధికారిగా నియమించారు. ఆతరువాత ఆమె జరిపిన విచారణలో ఈఎన్ఎస్ లైవ్ యాప్ రాసిన కధనాలన్నీ అవినీతి ఈఓపీఆర్డీ త్రిమూర్తులు , కార్యదర్శిలు దోచేసిన నిధులు లెక్కలతో సహా రుజువయ్యాయి. అంతవరకూ బాగానే వున్నా అక్కడి నుంచే అధికారులు, అక్రమార్కుల ఎత్తుగడలు పనిచేయడం మొదలుపెట్టాయి. ఎలాగైనా ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించాలని ప్రయత్నించే కొద్దీ ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా కధనాలు అందిస్తూనే వచ్చాం. దీంతో ఎట్టకేలకు సదరు అక్రమార్కులు బొక్కేసిన నిధుల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశాలతో వారిపై కమిషనర్ కు విచారణ నివేదికను పంపించారు విశాఖ జిల్లా అధికారులు. నివేదిక పంపిన రెండు నెలలకు గానీ కమిషనర్ కార్యాలయం నుంచి తిరుగు టపా రాలేదు. తీరా వచ్చిన తరువాత మళ్లీ అక్రమార్కుల యడ్లపల్లి త్రిమూర్తులు, మరో కార్యదర్శిపై ఛార్జిషీటు ఫైలు చేయడానికి మళ్లీ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కు ఫైలు పెట్టారు జిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారి. ఇలాంటి తేడా వ్యహారాల్లో ముక్కుసూటిగా ఉంటే జిల్లా కలెక్టర్ తక్షణమే ప్రభుత్వ నిధులు కాజేసిన వారిపై ఛార్జిషీటు ఫైలు చేయాలని ఆదేశించడంతో ఇద్దరు కార్యదర్శిలపై ఛార్చిషీటు ఫైలు చేశారు జిల్లా పంచాయతీ అధికారులు. పెద్దమొత్తంలో నిధులు బొక్కిన ఈఓపీఆర్డీ యడ్లపల్లి త్రిమూర్తులుపై చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ కు అధికారాలు లేకపోవడంతో కమిషనర్ కు మరోసారి ఫైలు పెట్టారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారి ఈఎన్ఎస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ విచారణలో తేలిన ఆధారాలతో ఇద్దరు కార్యదర్శిలపై ఛార్జిషీటు ఫైలు చేస్తున్నామని, మింగిన నిధులను రికవరీ చేయడంతో సస్పెండ్ కు సిఫారసు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ నిధులు ఎవరు పక్కదారిపట్టించినా, మింగినా కఠిన చర్యలు తప్పవని చెప్పారు. కరోనా రావడం, అదే సమయంలో అనుమతి కోసం కమిషనరేట్ కి ఫైలు పంపడంతో సమయపాలన జరిగిందని చెప్పుకొచ్చారు. ఎప్పటిలోగా అక్రమార్కులపై వేటుపడుతందని ప్రశ్నించగా...తాము విచారణ చేసి నివేదిక సమర్పించడంతో తమ పని అయిపోయిందని, ఆపై కమిషనర్ తమకు ఇచ్చే సూచనల ఆధారంగా చర్యలు ఉంటాయని వివరించారు. ఈ లెక్కంతా జరిగడానికి మరో మూడు నెలలు సమయం పట్టేటట్టు కనిపిస్తోంది. అందులోనూ సచివాలయ నిధులు అడ్డంగా మేసేసిన మూర్తికి ఉద్యోగ విరమణ దగ్గర పడటంతో ఏదైనా మతలబులు చేస్తారేమోననే ప్రచారం కూడా గుప్పుమంటుంది. చూశారు కదా పంచాయతీరాజ్ శాఖలో అధికారులు, సిబ్బంది వారికి దొరికిన కాడికి నొక్కేసిన నిధులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పా మీరు పెట్టిన ఖర్చులకో జిల్లా అధికారులు ముట్టుకోరని తేటతెల్లమైపోయింది. గ్రామాల్లో చల్లని బ్లీచింగ్ కు కోసం, వాసన రాని ఫినాయిల్ కోసం లక్షలకు లక్షలు బిల్లులు పెట్టి స్వాహా చేసేయొచ్చుని రుజువైపోయింది.. మీరు దోచుకున్న విషయం ఆధారాలతో సహా రుజువైనా మీపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రస్థాయి అధికారులు మీన మేషాలు లెక్కిస్తారనే ఎస్.రాయవరం మండలంలో జరిగిన నిధుల దోపిడీయే ఒక ప్రధాన ఉదాహరణగా మిగిలిపోయింది.. ఇదంతా చదివిన తరువాత గ్రామసచివాలయ స్థాయిలో చేసే అవినీతి ఆధారాలతో సహా మీడియాలో వస్తే అధికారులు చలించరని రూఢీ అయిన క్రమంలో ఏం చేస్తే బాగుంటుందో సిబ్బంది కూడా ఒక అంచనాకు వచ్చేస్తారేమో..అంతేగా..అంతేగా..!