ఘనంగా గౌరీ పరమేశ్వరుల అనుపోత్సం..


Ens Balu
6
s.rayavaram
2021-01-16 20:36:08

విశాఖ జిల్లా, ఎస్.రాయవరం గ్రామంలో వెలసిన గౌరీపరమేశ్వరుల అనుపు కార్యక్రమం శనివారం శ్రీ గౌరి యూత్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సారి కార్యక్రమం ఈ ఏడాది ప్రత్యేకంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం విశేషం.  ఎస్.రాయవరం గ్రామం లో అమ్మవారికి గుడి నిర్మించడటంతో పాటు ఈ ఏడాది రంగులు వేయించి మరింత సుందరంగా తయారు చేసారు. సాయంత్రం అనుపు మహోత్సవం మేలతాలాలతో, స్వామివార్లను ఘనంగా అనును చేశారు.  ఈ సందర్భగా గ్రామంలో పలు సాంస్క్రుతిక కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో యూత్ సంఘ సభ్యులు ఆడారి శ్రీను, భీమరశెట్టి శ్రీనివాసరావు, గ్రామంలోని పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.