ఎమ్మెల్యే గొల్ల ద్రుష్టికి రెవిన్యూ అవినీతి..
Ens Balu
3
s.rayavaram
2021-01-18 13:10:47
విశాఖజిల్లా ఎస్.రాయవరం మండలంలో రెవిన్యూ అధికారుల చేతివాటం ప్రదర్శించి తమ భూములు కోల్పోయిన విషయాన్ని మీడియా ముఖంగా పంచాయతీని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు దగ్గరకు తీసుకెళ్లారు బాధితులు. తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ తమకు ఎంత మేర నష్టం వాటిల్లిందనే విషయాన్ని ఎమ్మెల్యే ముందు గొల్లుమన్నారు. బాధితులు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రజలెవరూ నష్టపోకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే సావధానంగా విన్నారు. ఎస్.రాయవరం మండలంలో రెవెన్యూ అధికార యంత్రాంగం చేసిన అవినీతికి బాధితులైన వారు మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలోని తమ భూములను కోల్పోయిన 10 కుటుంబాల రైతులూ సామూహికంగా ఐక్యతతో వెళ్ళి కోరుప్రోలులోని ఎమ్మెల్యే స్వగృహంలో కలిసి జరిగిన నష్టాన్ని వివరించారు. తమ భూములను నిజమైన యజమానులు తామే అయినప్పటికీ, అన్ని యాజమాన్య హక్కు పత్రాలు తమ్ముడూ పేరునే ఉన్నప్పటికీ, అక్రమార్కులతో రెవిన్యూ అధికారులు కుమ్మకై తప్పుడు పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయల విలువైన తమ భూములను అక్రమార్కుల పేరున రెవిన్యూ రికార్డులలో నమోదు చేసి, పాస్ బుక్స్ మంజూరు చేసి లక్షల రూపాయల విలువైన తమ భూములను పరాయి వారికి దారాదత్తం చేయడానికి రెవిన్యూ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఈ దారుణాన్ని అడ్డుకోవాలని ఎమ్మెల్యేని బాధితులంతా కోరారు. అన్యాయమై పోయిన తాము తమ రికార్డులను పట్టుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ సంవత్సరాల తరబడి ఎస్.రాయవరం, తాహశీల్దార్, నర్సీపట్నం సబ్ కలెక్టర్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమకు అన్యాయం జరిగిందని వేడుకున్నా తమకు న్యాయం జరగ లేదని ఎమ్మెల్యేకి వివరించారు. ప్రతీ కుటుంబం తమకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా 3 రోజుల అనంతరం వ్రాత పూర్వకంగా తనకు సమర్పిస్తే దానిని స్వయంగా జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని వారికి అభయమిచ్చారు. అంతేకాకుండా బాధితులందరినీ కలెక్టర్ వద్దకు తీసుకొని వెళ్లి న్యాయం జరిగేలా చేస్తానన్నారు.