తహశీల్దార్ వేణుగోపాల్ పై చర్యలు తీసుకోవాలి..
Ens Balu
4
s.rayavaram
2021-01-18 19:56:10
భూ కబ్జాదారులను వెనుకేసుకు వస్తూ భూ హక్కుదారుల భూముల దారాదత్తం చేసిన గత తహశీల్దార్ వేణుగోపాల్ పై సిట్ విచారణ చేసి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు సోమవారం ఎస్.రాయవరం తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. భూ కబ్జా దారులకు విలువైన భూములు ధారాదత్తం చేస్తూ,తప్పుడు పాస్ బుక్ లు మంజూరు చేసిన తహశీల్దార్ వేణుగోపాల్ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బాధితులు యజమానులు డిమాండ్ చేశారు. మండలంలో 8గ్రామాలకు చెందిన బాధితులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోలన నిర్వహించి ప్రస్తుత తహశీల్దార్ సత్యన్నారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా బాధితుల్లో ఒకరైన యూ.ఎఫ్.ఆర్.టి.ఐ మండల కన్వీనర్ సోమిరెడ్డి రాజు మీడియాతో మాట్లాడారు.
8 గ్రామాలకు చెందిన రైతుల భూములు మార్చేచిన ఘనుడు తహశీల్దార్ వేణుగోపాల్ అని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ప్రయివేటు భూములుగా మార్చడం లో ఆయన దిట్ట అని తద్వారా ఎందరో భూ హక్కుదారులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామస్తుల సొంత స్థలాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించడంతోపాటు హక్కుదారులను ఎంతగానో వేధించారన్నారు. ఎస్.రాయవరం చెరుకు కాట వద్ద నున్న భూమిని స్థానిక నాయకులు బొలిశెట్టి గోవిందరావు బినామీ గా ఉన్న మాజీ సర్పంచి గా ఉన్న లక్కొజు ఆదిమూర్తి పేరున పాస్ బుక్ మంజూరు చేశారన్నారు. ప్రభుత్వ స్థలాల్లో కాకుండా నిబంధనలు అతిక్రమించి చెరువు గర్భం లో రూ.75 లక్షలతో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం గత తహశీల్దార్ పనితనానికి నిదర్శనమన్నారు. చెరువు గర్భాల్లో ప్రభుత్వ భవనాలు కట్టడాలు, భూ పట్టాలు ఇవ్వకూడదనే కోర్టు ఉత్తర్వులు ఉన్నా దానిపై నిబందనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే స్థానిక కోర్టు ని,హై కోర్టు ని ఆశ్రయించినట్టు చెప్పారు. పనులు నిలిపి వేయాలంటూ హై కోర్టు ఉత్తర్వులు జారీచేసినా సదరు తహశీల్దారుపై జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టలేదన్నారు. ఇన్ని రకాలుగా ప్రైవేటు వ్యక్తుల స్థలాలను మరొకరి పేరుతో దారాదత్తం చేసిన తహశీల్దార్ వేణుగోపాల్, రెవిన్యూ సిబ్బంది తో పాటు అతనికి సహకరించిన అప్పటి ఎస్.ఐ దనంజయ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ బాధితుల కు న్యాయం చేయాలన్నారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఈ సమస్యలు ఏవీ నా దృష్టికి రాలేదన్నారు. ఇప్పుడు మీ సమస్యలపై చర్చించి మా సిబ్బంది అప్పటి తహశీల్దార్ వేణుగోపాల్ పై విచారణ జరిపి ఆయన తప్పు చేసినట్లు రుజువైతే ఉన్నతాధికారులు కు నివేదిస్తాన ఈ సందర్భంగా బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 8 గ్రామాలకు చెందిన భూ బాదిత రైతులు, భూ హక్కుదారులు పాల్గొన్నారు.