వేక్సిన్ వేసుకున్నా ఆరోగ్యసూత్రాలు పాటించాలి..
Ens Balu
3
Sankhavaram
2021-01-19 20:40:01
కరోనా వేక్సిన్ వేయించుకున్న అంగన్ వాడీ కార్యకర్తలంతా ప్రభుత్వం నిర్ధేశించిన ఆరోగ్యసూత్రాలను పాటించాలని పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవీ సత్యన్నారాయణ అన్నారు. శంఖవరంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రెండో దఫాగా మంగళవారం కూడా కరోనా నివారణ టీకాలను వేసారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల మేరకు తొలి ప్రాధాన్యత కలిగిన ఉద్యోగులకు వేక్సిన్ అందిస్తున్నట్టు వివరించారు. సమగ్ర శిశు, మహిళా అభివృద్ధి సంస్థ పరిధిలోని శంఖవరం, రౌతులపూడి మండలాలకు చెందిన 60 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు నేడు ఈ టీకాలను వేశామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు బాలాజీ, సూర్యారావు, ఫార్మసిస్ట్ రమణకుమారి, స్టాఫ్ నర్సులు దాసరి ప్రశాంత కుమారి, దుర్గాదేవి, సీహెచ్ఓ.కృష్ణకుమారి, హెచ్వీ. వీరలక్ష్మి, ఏఎన్ఎం. అనురాధ, సూర్యకుమారి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు జక్కల సూర్యకాంతం, విజయ, ఇంకా పలువురు సిబ్బంది పాల్గొన్నారు.