ఫ్రంటలైన్ వారియర్స్ కరోనా టీకా వేసుకోవాలి..
Ens Balu
4
Padmanabham
2021-01-20 17:09:51
విశాఖ జిల్లా, పద్మనాభం మండలం వెంకటాపురం పంచాయితీ లో నిర్వహించిన కరోన వాక్సిన్ పంపిణీ కేంద్రాన్నిరాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో జరుగుతున్న వేక్సినేషన్ తీరును ఇక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న అంగన్వాడీ, ఏ ఎన్ ఎం, ఆశ కార్యకర్తలతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పద్మనాభం మండలంలో పని చేసే దాదాపుగా 200 మంది ఆశ వర్కర్స్, ఏఎన్ఎం , అంగన్వాడీ కార్యకర్తలకు, కరోన వాక్సిన్ పంపిణీ పూర్తిచేశామన్నారు. టీకా వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని టీకా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రేవిడి పిహెచ్ సిని అన్ని రకాలుగా అభివ్రుద్ధి చేయడంతోపాటు పూర్తిస్థాయి వైద్యం అందించేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రిలకు దీటుగా సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి వివరించారు..