ప్రజావ్యతిరేకవిధానాలను ఎండగడతాం!
Ens Balu
4
Koyyuru
2020-08-15 19:24:20
కేంద్ర,రాష్టప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను గ్రామస్థాయిలో ఎండగట్టాలని సిపిఎంశాఖ కార్యదర్శులు, సభ్యులు ప్రతినబూనారు. సిపిఎం రాష్ట్రకమిటీ ఆదేశాలమేరకు శనివారం మండలంలోని డౌనూరు పంచాయితీ ముళ్లిమెట్ట, నిమ్మలపాలెం, మూలపేట పంచాయితీ జాజులబంద గ్రామాల్లో సిపిఎం శాఖ సమావేశాలను నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వాలు సామాన్యుడిని ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ముళ్లిమెట్టలో పి.బాలరాజు, సీతారామయ్య, జయశంకర్, ఆర్బికరిష్ణ, బాలరాజు, చంద్రబాబు, నిమ్మలపాలెంలో జి.సాన, సోమయ్య, రాజు, సిద్ధు, జాజులబందలో కె.చిట్టిబాబు, రంగన్న, కరిష్ణ, మర్రివెంకటరావు, జి.సతీష్ పాల్గొన్నారు.