దక్షిణంలో అభివ్రుద్ధికి ప్రతిపాదనలు..
Ens Balu
2
Visakhapatnam
2021-01-23 20:25:44
విశాఖలోని దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జివిఎంసీ కమిషనర్ ను కోరారు. శనివారం ఈ మేరకు కమిషనర్ ను కలిసి రూ.700 కోట్లతో ప్రతిపాదనలను కమిషనర్ ను కలసి ఆమె చాంబర్ లో అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దక్షిణ నియోజిక వర్గం అభివృద్ది కొరకు సదరు ప్రతిపాదనలను పరిశీలించి వీలైనంతవరకు మంజూరు చేస్తానని ఎం.ఎల్.ఎకు కమిషనర్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా పాడైన రోడ్లు, కాలువలు, గెడ్డల మరమత్తులు, కమ్యునిటీ హాలు నిర్మాణం, మంచినీటి వ్యవస్థ నిర్వహణ, ప్రహరీ గోడలు నిర్మాణం మొదలైన పనుల ప్రతిపాదనలు పరిశీలించి, తగు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పాత నగరం, కె.జి.హెచ్., రంగి రీజు వీధి, రెల్లి వీధి, కొబ్బరితోట తదితర ప్రాంతాల్లో ప్రతీ రోజూ రోడ్లు, కాలువలు శుభ్రం చేయాలని చీఫ్ మెడికల్ ఆఫీసరును ఆదేశించారు. దక్షిణ నియోజిక వర్గంలో వివిధ ప్రాంతాలో ఉన్న స్మశాన వాటికలు, దోభీఖానాలు నిర్మాణం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, నెహ్రూ బజార్ ఆధునీకరణ పనులు, జగదాంబ నుండి పాత పోస్టాఫీసు వరకు 60 అడుగుల రోడ్డును విస్తరించే పనులు, హ్యాకర్స్ జోన్స్ ఏర్పాటుకు పెట్టిన ప్రతిపాదనలు అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, సి.సి.పి. విద్యుల్లత, యు.సి.డి.(పి.డి) వై. శ్రీనివాస రావు, పర్యవేక్షక ఇంజినీరు శ్యామ్సన్ రాజు, మూడవ జోనల్ కమిషనర్ ఫణిరాం, రెండవ జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు, నాల్గవ జోనల్ కమిషనర్ సింహాచలం, ఏ.సి.పి. అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.