ఇంటింటికీ సరుకులపై పంపిణీపై శిక్షణ..


Ens Balu
2
Koyyuru
2021-01-25 22:10:33

గ్రామాల్లో ఇంటింటికి సరఫరా చేసే నిత్యావసర సరుకులు డీలర్‌ నుంచి వ్యాన్‌ ద్వారా తరలించి తెల్లకార్డు లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని డివిజనల్‌ సివిల్‌ సప్లయ్‌ అధికారి పి.శ్రీనివాసరావు వాలంటీర్లు, డిఆర్‌డిపో డీలర్లను ఆదేశించారు. సోమవారం తహశీల్దార్‌ కార్యాలయంలో సివిల్‌ సప్లయ్‌ డిటి ఆధ్వర్యంలో  డీలర్లు,వాలంటీర్లకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెల్లరేషన్‌కార్డు నెంబర్‌,డిపో నెంబర్‌ ఖచ్చితంగా ఎలక్ట్రానిక్‌ మిషన్‌లో ఏ విధంగా నమోదు చేయాలి,వేలి ముద్రల స్వీకరణ తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన డీలర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి వాలంటీర్‌ 50 కార్డులకు ఈ నిత్యవసర సరుకులు అందించే బాధ్యత తీసుకోవాలన్నారు. మండలంలో ఉన్న 56డిపోలకు 11 మినిసప్లయ్‌ వ్యాన్లు ద్వారా సరుకులు పంపిణీ చేయాలన్నారు.గ్రామాల్లో కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ నిత్యవసర సరుకులు అందేలా డీలర్లు,వాలంటీర్లు పనిచేయాలన్నారు. ఎటువంటి ఫిర్యాదులోచ్చినా, అవకతవకలకు పాల్పడినా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం తప్పదని సివిల్‌ సప్లయ్‌ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
సిఫార్సు