జిరాయితీగా చూపి..రికార్డులు తారుమారుచేసి..
Ens Balu
2
ఎస్.రాయవరం,
2021-01-27 17:28:26
విశాఖజిల్లా ఎస్.రాయవరం మండంలోని దేవాదాయశాఖకు చెందిన భూములను కాజేయాలని చేస్తున్న ప్రయత్నంపై దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు కాలుపెట్టి తప్పుడు ధ్రువపత్రాలతో ఏకంగా 9.20 ఎకరాలు కొట్టేద్దామని చేసిన ప్రయత్నానికి విచారణ అనే అడ్డుకట్ట వేశారు. వివరాలు తెలుసుకుంటే ఎస్.రాయవరం మండంలోని లింగరాజుపాలెం రెవిన్యూ సర్వే నెంబరు 238లో 9.20 ఎకరాల భూమి ఇనాం మెట్టు లోకల్ ఫండ్ ఛౌల్ట్రీ(దేవాదాయశాఖ)కె చెందిన భూమిగా ఫైనల్ గెజిట్2015(22ఏ) కూడా ఇనాం మెట్టు భూమిగానే రెవిన్యూ రికార్డులు చూపిస్తున్నాయి. కానీ రెవిన్యూ రికార్డులు అడంగల్ 1బి ప్రకారం ఈ భూమి సర్వే నెంబరు 238లో ఆ మొత్తం భూమి జిరాయితీ మాగాణిగా ఖాతా నెంబరు7777గా పట్టాదారు క్రయంగా చూపిస్తోంది. దీనిపై యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కన్వీనర్ రెవిన్యూ అధికారులకు, దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దీనిపై సమాచార హక్కుచట్టం క్రింద కూడా దరఖాస్తు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. దీంతో వెంటనే రికార్డులతో సహా రంగంలోకి దిగిన దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు తమ భూమికి పట్టాదారు పాసుపుస్తకం కావాలని రెవిన్యు అధికారులను ఆదేశించారు. దీంతో డొంక మొత్తం కదిలింది. ప్రభుత్వ లెక్కలు, దేవాదాయశాఖ అధికారుల రికార్డుల ప్రకారం అంతా సక్రమంగానే ఉన్నా, మండలంలోని రెవిన్యూ రికార్డులు మాత్రం పూర్తిగా తేడాగా ఉన్నాయి. వాస్తవానికి ఏ భూమికైనా సబ్ డివిజన్ చేసి, భూమి యొక్క హక్కు దారులుగానీ, భూమిని అనుభవిస్తున్నవారు సొంత రికార్డులతో బదలాయించినపుడు మాత్రమే క్రయం రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అవుతాయి. అలాకాకుండా ఏకంగా సుమారుగా పది ఎకరాల భూమిని కొట్టేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్ కి కాస్తా అధికారులు ఏకంగా బౌండరీలు వేయడానికి సిద్దం చేయడం ఇపుడు ఆశక్తిగా మారింది. ఇదిలా ఉండగా ఈ భూమిపక్కనే ఉన్న భూమి 1.78 ఎకరాల భూమిని సేకరించిన విషయానికి సంబంధించి ఇప్పటికే పేదల ఇంటి స్థలాల కోసం రూ.38 లక్షలు చెల్లించినట్టుగా ప్రచారం జరుగుతుంది. రెవిన్యూ, దేవాదాయశాఖలోని వారు కలిసే ఈ భూ మాయ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో సుమారు రూ.కోటి రూపాయలు చేతులు మారినట్టు సమాచారం అందుతుంది. ఈ తంతుపై దేవాదాయశాఖ భూమికి సంబంధించి తక్షణమే పాసుపుస్తకం ఇవ్వాలని, మండల రెవిన్యూ అధికారులకు దేవాదాశాఖ నుంచి ఆదేశాలు రావడంతో తప్పుడు రికార్డుల విషయంలో ఎవరి సీటు గల్లంతు అవుతుందోనని రెవిన్యూ వర్గాల్లో ఆందోలన మొదలైంది. దేవాదాయశాఖకు చెందిన భూమి కొలతలు వేసే సమయంలో అసలు విషయం బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిన్నాయి. క్రయం జరిగినట్టుగా ఉన్న రికార్డుల్లోని వ్యక్తి భూమిని కొలిచే సమయంలో ఆ స్థలంలోకి వస్తే ఆ సమయంలో రెవిన్యూ అధికారులు, దేవాదాయశాఖ అధికారులు కలిసి చేసిన ఈ భూమాయ అసలు విషయాలు ఆధారాలతో సహా బయటకు వచ్చే అవకాశం వుంది. దానికి కారణం దేవాదాయశాఖ వద్ద పూర్తిస్ధాయి ఆధారాలుండటమే. దీనితో ఎస్.రాయవరం మండలంలో జరుగుతున్న భూమాయపై ఇటు జిల్లా కలెక్టర్ కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 9.20 ఎకరాల భూమాయ విషయం కొలతల్లో తేలితే భూమి మొత్తం దేవాదాయశాఖదని తేలితే ఎస్.రాయవరం మండంలోని ఏ తహశీల్దార్ ఉన్నపుడు రికార్డులు తారుమారు అయ్యాయో కూడా బయటకు వస్తుంది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు కోరినట్టుగా అసలు మండల రెవిన్యూ అధికారులు ఆ భూమిని కొలుస్తారా, రికార్డులు బటకు తీస్తారా, ఏ ప్రైవేటు వ్యక్తికి క్రయం అయినట్టు రికార్డులు తయారు చేశారో అవి బయటకు వస్తాయా? మరో వైపు రిజిస్ట్రార్ కార్యాలయంలో సంపాదించిన ఆర్టీఐ సమాచారం ఆధారంగా ఎవరిపై చర్యలు తీసుకుంటారనేది ఇపుడు ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి తమశాఖకు చెందిన భూమిని ఆధారాలతో సహా తాము స్వాధీనం చేసుకోవడంతోపాటు, ప్రభుత్వ భూమి రికార్డులను టేంపరింగ్ చేసి, అడంగల్ లో పేర్లు మార్పుచేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు కూడా ఉపక్రమించి కేసులు నమోదు చేస్తామని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ భూమాయపై ఏంజరుతుందనేది వేచిచూడాలి..!