గౌరీ పరమేశ్వరులను దర్శించుకున్న ఎంపీ..


Ens Balu
2
Anakapalle
2021-01-30 18:00:51

గౌరీపరమేశ్వరుల దయతో కరోనా అంతరించిపోవాలేని ఎంపీ డాక్టర్ బి.సత్యవతి అన్నారు. శనివారం అనకాపల్లిలోని గవరపాలెంలోని శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల సందర్భంగా ఉత్సవ మూర్తులను ఎంపీ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీరాక సందర్భంగా నిర్వహాకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అనకాపల్లిలో గౌరీపరమేశ్వరుల సంబరాలు రాష్ట్రంలోనే పేరుగడించాయని, అలాంటి సంబరాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించి ఈ ప్రాంతానికి మరింత పేరు తేవాలని కోరారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎంపీ పరిశీలించాలరు. ఈ కార్యక్రమంలో డా.విష్ణుముర్తి తదితరులు పాల్గొన్నారు.