ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి..
Ens Balu
2
Parvathipuram
2021-02-01 19:46:11
పార్వతీపురం డివిజన్ లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని ఐటిడిఏ పీఓ, ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ సోమవారం బలిజి పేట, సీతానగరం మండలాల్లో బొబ్బిలి డి.ఎస్.పి మోహన రావు, సి. ఐ, ఎం.పి.డి. ఓ లు, తహశీల్దార్లుతో కలసి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు, ముందుగా బలిజీ పేట మండలం అజ్జడ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు, ఆనంతరం సీతానగరం మండలం నిడగల్లు, పేదబోగిలి, బుర్జ గ్రామాలను పర్యటించారు. నేటికీ చేపడుతున్న పనుల పై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను ఆన్ని దశల్లోనూ తూచా తప్పక అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు, ఏదైనా పోలింగ్ కేంద్రం మార్పు చేయాల్సిన అవసరం ఉంటే ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ రోజు జిల్లాలో పర్యటించనున్నారని, ప్రతి వారు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని, బ్యాలెట్ బాక్స్ లను ముందుగా పరిశీలించు కావాలని సూచించారు. ప్రస్తుతం ఆర్.ఓ., ఎ.ఆర్.ఓ లకు శిక్షణా కార్యక్రమం జరుగుతోందని, త్వరలో పి.ఓలు, ఎ.పి.ఓ.లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. డి.ఎస్.పి.తో మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలు గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ పర్యటనలో ప్రాజెక్ట్ అధికారి పర్యటించిన గ్రామాలలో గ్రామ పెద్దలు, ప్రజలతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్నికల ప్రవర్తనా నియావళిని ప్రకారం గ్రామంలో ప్రజలు, పోటీ చేసే అభ్యర్థులు నడుచుకోవాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఉపెక్షించేది లేదన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి బొబ్బిలి డి.ఎస్.పి. మోహన రావు, సి.ఐ., బలిజిపేట, సీతానగరం మండలాల తహశీల్దార్లు, ఎం.పి.డి. ఓ లు, ఎస్.హెచ్. ఓ లు, వి.ఆర్. ఓ లు, పంచాయతీ సెక్రటరీలు హాజరయ్యారు.