వజ్రగడలో పోలింగ్ కేంద్రాలను పరిశీలిన..
Ens Balu
4
Makavarapalem
2021-02-01 21:27:21
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా నర్సీపట్నం డివిజన్ పరిధిలో రెండవ దశ నోటిఫికేషన్ ఫిబ్రవరి 2 వ తేదీ నుండి 4వ తేదీ వరకు నామినేషన్లు జరగనున్న నేపథ్యంలో నర్సీపట్నం సబ్ కలెక్టరు ఎన్ మౌర్య మాకవరపాలెం మండలం వజ్రగడ పంచాయతీ ను సందర్శించారు. పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ మైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ అధికారులకు సూచనలు జారీ చేశారు. అదే విధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి సక్రమంగా అమలు జరిగే విధంగా (ఏం సీ సీ)మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ /సర్వెలేన్స్ టీమ్స్ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు . ఆనంతరం సబ్ కలెక్టర్ రాచపల్లి పోలీస్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టరు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నివృత్తి చేసుకోవచ్చన్నారు. అదే విధంగా ఎన్నికల కు సంభందించి ఏమైనా సమస్యలు ఉంటే సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఫోన్ నంబర్లకు (7731803255, 8465013255)ఫిర్యాదు చేయవచ్చునన్నారు.