ఎన్నికల సామగ్రి తరలింపు ట్రయిల్ రన్..
Ens Balu
3
Anantapur
2021-02-03 18:10:31
అనంతపురం జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఎన్నికల సామగ్రిని ఆయా పంచాయతీ పోలింగ్ కేంద్రాలకు చేరవేత కు సంబంధించి బుధవారం మధ్యాహ్నం స్థానిక జడ్పీ కార్యాలయంలోని ప్రాంగణంలో వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ట్రయిల్ రన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన సామాగ్రిని తరలింపు దిశగా వాహనాల ద్వారా చేరుకున్న ఎన్నికల నిర్వహణ సిబ్బందికి పోలింగ్ మరియు కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో వివిధ వాహనాల్లో సామాగ్రితో పాటు ఎంతమంది సిబ్బంది ప్రయాణించగలరు అనే దానిపై అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం 10 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బందిని ఎంపిక చేసుకొని ఆయా పంచాయతీల వాహనాల అంచనాల కేటాయింపునకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పంచాయతీ ఎన్నికల మాస్టర్ ట్రైనింగ్ నోడల్ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఒక ప్రైవేటు బస్సు, మినీ బస్సు, టాటా సుమో వాహనాలలో ఎన్నికల సిబ్బంది సామాగ్రిని తీసుకొని వెళ్లే విధంగా వీలుగా తర్ఫీదు పొందారు. ఈ కార్యక్రమంలో జడ్పీ శ్రీనివాసులు, ఆర్టీసీ లా అధికారి చంద్రశేఖర్, డిటిసి నిరంజన్ రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారులు విజయ్ కుమార్ రెడ్డి, రమణ, ఆర్టిసి డిపో మేనేజర్ పిచ్చయ్య, ఎంవీఐ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.