ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..
Ens Balu
3
Nakkapalli
2021-02-03 22:17:56
గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖజిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్ నర్సీపట్నం డివిజన్ లోని నక్కపల్లి , ఎస్ రాయవరం మండలాలలో పర్యటించి పోలింగు, నామినేషన్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలింగ్ సిబ్బంది తో ఎన్నికల ఏర్పాట్లపై తగు సూచనలను జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అధికారులంతా ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్ధుల నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలన చేసిన తరువాత మాత్రే స్వీకరించాలని చెప్పారు. ఏ కేంద్రం నుంచి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, మండల తాసిల్దార్ లు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.