సత్యన్నాయుడుకి అడుగడుగునా ఆదరణ..
Ens Balu
2
క్రిష్ణదేవిపేట
2021-02-06 20:05:20
గొలుగొండ మండలం క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీకి సర్పంచ్ బరిలో వున్న పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యన్నాయుడు)కి గ్రామస్తుల నుంచి విశేషంగా ఆదరణ లభిస్తోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పాతూరు కాలనీ ప్రాంతంలోని అన్ని వర్గాల వారిని కలిసి ఓట్లను అభ్యర్ధించారు. ఈ మేరకు శనివారం గ్రామంలోని ప్రతీ ఒక్క ఓటరు దగ్గరకి వెళ్లి గ్రామాభివ్రుద్ధికి సహకరించాలని కోరారు. అందరూ ఏకమై ఒక్కట్టిగా నిలిస్తే గ్రామాన్ని జిల్లాలోనే మంచి గ్రామంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పాడుతుందని అన్నారు. అన్నివర్గాల వారికి సమ న్యాయం చేసేవిధంగా వార్డు మెంబర్లుగా కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి అభ్యర్ధులను 10 వార్డుల్లో నిలబెట్టామని చెప్పరు. వార్డు సభ్యులను గ్రామస్తులకి పరిచేయం చేస్తూ, వార్డు అభివ్రుద్ధికి తాము ఏం చేస్తామో కూడా గ్రామస్తులకు వివరించారు. తాను మాటల మనిషిని కాదని, గ్రామ రూపు రేఖలు మార్చి చూపిస్తానని ప్రజలకు తన ఆలోచనలను వివరించారు. పుట్టి పెరిగిన గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివ్రుద్ధి చేయడానికే ఈసారి తాను సర్పంచ్ గా పోటీలో నిలబడ్డానని, పెద్ద మనసుతో మీ ఇంటి అన్నగా, తమ్ముడిగా బావించి తనను గెలిపించాలని గ్రామస్తులను పేరు పేరునా కోరారు. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకి సాగారు. ఈ ప్రచారం కార్యక్రమంలో ఆర్ఎంపీ వైద్యుడు పందిరి వెంకటరమణ(బుజ్జి), అన్ని వార్డుల నుంచి అధిక సంఖ్యలో మహిళలు, యువత, పెద్దలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.