ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు..


Ens Balu
2
Kadiam
2021-02-10 15:12:09

ఎన్నికల సామాగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్‌ ) ‌కేంద్ర, రిసెప్షన్‌ ‌కేంద్రాలలో అన్ని సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు పూర్తిస్దాయిలో చేపట్టాలని సంబందిత అధికారులను స్దానిక సబ్‌ ‌కలెక్టరు అనుపమ అంజలి ఆదేశించారు. బుధవారం ఆమె ఆలమూరు కడియం మండలాలలో పర్యటించి ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న రెండవ విడత స్దానిక సంస్దల ఎన్నికల ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు పలుసూచనలు ఆదేశాలు జారీచేసారు. ఈ కేంద్రాలు నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించి వారు నిర్వహించాల్సిన విధులు గూర్చి పూర్తిగా అవగాహన పెంపొందించాలన్నారు.  ప్రస్తుత కోవిడ్‌-19 ‌నేపధ్యంలో బౌతిక దూరాలు పాటించాలని, మాస్కుధారణ, శానిటైజేషన్‌లు తప్పక పాటించాలన్నారు. ఆదేవిధంగా పోలింగ్‌ ‌కేంద్రంలో సిబ్బందికి అవసరమైన ఫర్నీచరును ఏర్పాటుచేయాలని రిప్రెష్‌మెంటు బోజన వసతుల కల్పనకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కౌంటింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు ప్రదానంగా భద్రత పరమైన ఏర్పాట్లు అనగా నిరంతర విద్యుత్‌ ‌సరఫరా , బారికేడింగు ఏర్పాట్లు పిన్సింగ్‌ ‌మరుగుదోడ్లు త్రాగునీరు,  కౌంటింగ్‌ ‌సామాగ్రి ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకోవాలన్నారు. జనరేటర్లు  సదుపాయం తప్పక కల్పించాలన్నారు.  కౌంటింగ్‌ ‌సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి సిబ్బందిని ఆయా గ్రామపంచాయితీలలో విధులు నిర్వహించుటకు తగు రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలమూరు ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాట్లును చెముడులంక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ ‌కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లును ఆమె పరిశీలించారు. ఆలమూరు మండలంలో 18 గ్రామపంచా యితీలకుగాను ఒక గ్రామపంచాయితీ ఏకగ్రీవం అయ్యిందన్నారు. 208 వార్డుమెంబర్లకుగాను 10 వార్డులు ఏకగ్రీవం అయ్యాయన్నారు.  మిగిలిన 198 వార్డు మెంబర్లు, అదేవిధంగా మిగిలిన 17 సర్పంచ్‌ ‌పదవులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు కొన్ని గ్రామపంచాయితీలు ఏకగ్రీవం అయ్యినందున రూట్లు కాని జోన్లు కాని అవసరమైన మార్పులు చేసి వెంటనే సంబందిత అధికారులకు తెలియపర్చాలన్నారు జోనల్‌, ‌రూటు అధికారులు వెంటనే విధులలో చేరి గ్రామాలలో పర్యటించి ఏర్పాట్లన్నిటిని సమీక్షించుకోవాలన్నారు. ఆ ప్రాంతంలోఎవరైనా కోవిడ్‌ ‌సోకిన వ్యక్తులుగాని అనుమానితులనుగాని ఉంటే వారికి కేటాయించిన పోలింగ్‌ ‌కేంద్రంలో చివరి గంటలో అనగా మధ్యాహ్నాం 2,30 గంటల నుంచి 3.30 గంటలవరకు ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల ద్వారా సరఫరా కాబడిన  వ్యక్తిగత పరిరక్షణ కిట్లు (పిపిఇ) ధరింపజేసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రిపోర్టు చేసిన అధికారులు ఎవరైన సహాయం కొరితే రిజర్వులో ఉన్న అధికారులను అవసరార్దం వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల పక్రియలో అధికారులు సిబ్బంది ప్రణాళికాయుతంగా నిబంధనల ప్రకారం విధులను శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహించాలన్నారు. ఓటరు నిర్బయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఉదయం 6.30 గంటనుంచి మధ్యాహ్నాం 3.30 గంటలవరకు పోలింగ్‌ ఉం‌టుందన్నారు.పారదర్శకత కొరకు అతిసమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ ‌కేంద్రాలలో సూక్ష్మపరిశీలకు సమక్షములో వీడియోచిత్రకరణ, వెట్‌కాస్టింగ్‌తోపాలింగ్‌ ‌నిర్వహించాలన్నారు. కడియం ఎంపిడిఓ కార్యాలయం, పోట్టిలంక, దామిరెడ్డిపల్లిలలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. పూర్తి భద్రతా చర్యల నడుమ కౌంటింగ్‌ ‌నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఎల్‌పిఓ జె సత్యనారాయణ, ఎపిడిఒలు మహేశ్వరరావు, జెఎఝాన్షీతాహిసిల్దార్లు జి.భీమారావు, జి.లక్ష్మీపతి, సురేంద్రరెడ్డి, రాజ్‌కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.