పాతూరు సర్పంచ్ గా సత్యంనాయుడు..!


Ens Balu
3
క్రిష్ణదేవిపేట
2021-02-13 20:02:26

విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట(పాతూరు) సర్పంచ్ గా సత్యంనాయుడు గెలుపొందారు. జిల్లాలోనే ప్రతిష్టాత్మక పంచాయతీ పాతూరులో ఏ పంచాయతీలోనూ లేని విధంగా నలుగురు అభ్యర్ధులు బరిలో వున్నప్పటికీ ఈ పోటీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు గెలుపొందడం విశేషం. అయితే సర్పంచ్ సత్యంనాయుడు మెజార్టీ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం 126 ఓట్లు మెజార్టీతో గెలుపొందినట్టు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి వర్తమానం అందింది. కాగా మెజార్టీ పెరిగే అవకాశాలన్నట్టు మా చీఫ్ రిపోర్టర్ బాలు సంఘటనా స్థలం నుంచి లైవ్ అప్డేట్ అందించడానికి సిద్దంగా ఉన్నారు. త్వరలోనే ఆ పూర్తివివరాలను తెలియజేస్తాం...అయితే సాప్ట్ వేర్ ఇంజనీర్ సత్యంనాయుడే పాతూరు సర్పంచ్ అనే విషయాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ నాలుగు రోజుల క్రితమే వార్త ప్రచురించింది. 
సిఫార్సు