ఈఎన్ఎస్ లైవ్ కధనమే నిజమైంది.. పాతూరు సర్పంచ్ సత్యంనాయుడు..
Ens Balu
2
Krishnadevipeta
2021-02-13 22:45:34
ఆరు తరువాత ఏడు పాతూరు సర్పంచ్ సత్యంనాయుడు అనే ఈ శీర్షికతో సరిగ్గా 4 రోజులు క్రితం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ప్రత్యేక కథనంగా ప్రచురిచింది. నేడు ఆ వార్త నిజమైంది. 463 ఓట్లతో వైఎస్సార్సీపీ మద్దతు దారుడు పందిరి సత్యన్నారాయణ (సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు) క్రిష్ణదేవిపేట(పాతూరు) సర్పంచ్ గా అఖండ మెజార్టీతో ముగ్గురు అభ్యర్ధులను ఓడిస్తూ గెలుపొందాడు. దీనితో ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ కధనంపై పాఠకులకు పక్కాగా నమ్మకం ఏర్పడింది. ఎప్పుడూ వాస్తవాలకు పెద్దపీట వేసే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు గెలుపు విషయంలోనూ అదే చెప్పింది. అల్లూరి సీతారామరాజు తెల్లదొరలపై పోరుబాట సాగించిన పాతూరులో అల్లూరి సాక్షిగా బరిలోకి దిగి ప్రత్యర్ధులను మట్టికరిపించారు సత్యంనాయుడు. ఈ విషయంలో సత్యంనాయుడు తమ్ముడు ఆర్ఎంపీ బుజ్జి చేసిన నిశ్వార్ధ వైద్య సేవలు విశేషంగా పాతూరు ప్రజలను చైతన్య వంతం చేయడంతోపాటు ఎంతగానో ఆలోచింపజేశాయి. నిజమైన అభ్యర్ధి, నికార్శైన అభ్యర్ధి బరిలో వుంటే వార్ వన్ సైడ్ అయిపోతుందనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవడం విశాఖజిల్లాలోనే చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా సత్యంనాయుడు గెలుపు విషయంలో ఈఎన్ఎస్ లైవ్ యాప్ కథనాలన్నీ వాస్తవాలవడంతో జిల్లా నలుమూలల నుంచి న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి వందల కొద్దీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి మంచి కధనాలు రానున్న రోజుల్లో ఈఎన్ఎస్ లైవ్ యాప్ అందించాలని కూడా శుభాకాంక్షలు తెలియజేశారు పాఠకులు..