విశాఖమన్యంలో 528కి చేరి కరోనా పాజిటివ్ కేసులు
Ens Balu
1
Paderu
2020-08-17 20:10:44
విశాఖ మన్యంలో కరోనా సోమవారం కొత్తగా 23 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. కె లీలాప్రసాద్ చెప్పారు. దీంతో మొత్తంగా కరోనా పాజిటివ్ ల సంఖ్య 528 కి చేరిందన్నారు. కాగా 258 మంది డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. గెన్నెల పిహెచ్సీ పరిదిలో 7, కిలగాడ పీహెచ్సీలో1, హుకుంపేటలో 2, మినుమూలు పీహెచ్సీలో 2, లోతుగెడ్డ పీహెచ్సీలో 5, ఆర్వీనగర్ పీహెచ్సీలో 6 కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసు ఉద్రుతి ఏజెన్సీ ప్రాంతలోనూ అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో తప్పా బయటకు రాకూడదన్నారు. మాస్కులు విధిగా ధరించాలని, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే దగ్గర్లోని పీహెచ్సీలోని ఆరోగ్య సిబ్బందికి, లేదా గ్రామసచివాలయాల్లోని వాలంటీర్లకు తెలియజేసి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.