టిడిపి కమిటీనేతగా సోమిరెడ్డిరాజు..
Ens Balu
3
s.rayavaram
2021-02-24 11:56:07
ఎస్.రాయవరం గ్రామకమిటీ టిడిపి నాయకుడిగా సోమిరెడ్డిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో బుధవారం జరిగిన గ్రామకమిటీ సమావేశంలో రాజును కార్యకర్తలంతా కలిసి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిటిపి సీనియర్ కార్యకర్తలు మాట్లాడుతూ, టిడిపికి బలమైన నాయకుడు లేకపోవడం వలన ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడానికి వీలులేకుండా పోతుందన్నారు. ఈయనను ఎన్నుకోవడం ద్వారా ఎస్.రాయవరం మండలకేంద్రంలో టిడిపి మరింత అభివ్రుద్ధి చెందడానికి ఆస్కారం వుంటుందన్నారు. సోమిరెడ్డిరాజు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గ్రామకమిటీ నేతగా ఎన్నుకోవడం ఆనందంగా వుందన్నారు. పార్టీ అభివ్రుద్ధితోపాటు, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి అన్ని రకాలగా సమిష్టి క్రుషి చేద్దామని అన్నారు. ఎస్.రాయవరం మండల కేంద్రంలో పార్టీ అభివ్రుద్ధి నూతక కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రణాళికా బద్దంగా ముందుకు నడుద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల వాసు, మురుకుర్తి గణేష్, కర్రి అబద్ధం, భీమరశెట్టి సత్యనారాయణ, నాగ సూరిబాబు, దుబాసి రమేష్, అంకాబత్తుల రమణ, అంగిన రమణ, బత్తుల సూరన్న, తాడేల సంతోష్, కర్రి శ్రీనివాసరావు, 13 వ వార్డ్ మెంబర్ గాలి సత్యనారాయణ, కశింకోట రాంబాబు, సూర్య ప్రకాష్, తదితరులు, పాల్గున్నారు.