PHCలో వాక్సిన్ వేయించుకున్న ఎస్పీ..


Ens Balu
5
Singupuram
2021-02-24 14:38:44

కోవిడ్ వాక్సిన్ ను పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ సింగుపురం పి.హెచ్.సిలో తీసుకున్నారు. ఏ.ఎన్.ఎమ్ రోజారాణి ఎస్.పికి వాక్సిన్ వేశారు. ఫ్రంట్ లైన్ కోవిడ్ వర్కర్లకు వాక్సినేషన్ లో భాగంగా బుధ వారం పోలీసు శాఖకు వాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. సింగుపురం పి.హెచ్.సిలో సింగుపురం పి.హెచ్.సిలో ఎస్.పి అమిత్ బర్దార్ తో పాటు ఏ.ఎస్.పి టి.పి.విఠలేశ్వర్, ఎస్.ఇ.బి ఏ.ఎస్.పి కంచి శ్రీనివాసరావు, డి.ఎస్.పి జి.శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ పి.వి.రమణ తదితరులు వాక్సిన్ ను తీసుకున్నారు.  వాక్సిన్ తీసుకున్న అనంతరం ఎస్.పి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోవి షీల్డ్ వాక్సిన్ తీసుకోవడం జరిగిందని అన్నారు. వాక్సిన్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వాక్సిన్ కు పేరు నమోదు చేసుకున్న క్రమంలో సింగుపురం పి.హెచ్.సిలో వాక్సినేషన్ కు పేరు వచ్చిందని చెప్పారు. వాక్సిన్ తీసుకొనుటకు ప్రాధాన్యత క్రమం ఉండదని, అందరూ సమానమేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని ఆయన అన్నారు. వాక్సిన్ తీసుకొనుటకు భయం అవసరంలేదని పేర్కొన్నారు. అయితే వైద్యుల సూచనలు పాటించాలని కోరారు. వాక్సిన్ తీసుకునే ముందు రోజు మంచి నిద్ర ఉండాలని, వాక్సిన్ అనంతరం తగిన విశ్రాంతి తీసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ వ్యాప్తి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయని అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 2వ సారి, 3వ సారి లాక్ డౌన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నట్లు గమనించాలని పేర్కొన్నారు. దీని దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని సూచించారు.        అదనపు  డి.ఎం.హెచ్.ఓ డా.బి.జగన్నాథ రావు మాట్లాడుతూ కోవిడ్ వ్యాప్తిపట్ల ప్రజలు అందరూ అప్రమత్తం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు.  దక్షిణాఫ్రికా తదితర కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నట్లు గమనిస్తన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ డా.కె.సి.చంద్ర నాయక్, డి.ఐ.ఓ డా.ఎల్. భారతి కుమారి దేవి తదితరులు ఉన్నారు.