కాలనీల్లో మౌళిక సదుపాయలు కల్పించండి..
Ens Balu
2
Pothavaram
2021-02-24 15:00:37
ఆర్అండ్ ఆర్ కాలనీల్లో మౌళిక సదుపాయాల కల్పన సత్వరమే చేపట్టాలని రంపచోడవరం ఆర్డీఓ శీనానాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమలపాలెం, పోతవరం కాలనీలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, కాలనీల నిర్మాణాలు పూర్తయ్యేనాటికి మిగిలిన సదుపాయాలు కూడా పూర్తచేయాలన్నారు. తద్వారా ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు. నీటి సరఫరరా, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు సత్వరమే పూర్తిచేయాలన్నారు. మరో 15 రోజుల్లో సదుపాయాల పురోగతిపై నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ వెంట తహశీల్దార్ వీర్రాజు, రెవిన్యూ ఇనెస్పెక్టర్ బాపిరావు, గ్రామ రెవిన్యూ అధికారి సతార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.