నూకాలమ్మ తల్లి ఆలయంలో ఏకాహం..
Ens Balu
12
Annavaram
2021-02-26 20:52:27
అన్నవరం బిసికాలనీలో వెలసిన శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 24 గంటల భజనా కార్యక్రమం(ఏకాహం) ఏర్పాటు చేసినట్టు ఆలయ ధర్మకర్త గంగరాజు తెలియజేశారు. శుక్రవారం అన్నవరంలోని అమ్మవారి ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం ఆరుగంటల నుంచి ఆదివారం ఉదయం ఆరుగంటల వరకూ ఏకాహం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వివిధ భజనా బ్రుందాలు పాల్గొంటాయన్నారు. అలాగే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి అమ్మవారి ఆలయంలో భారీ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. యావత్ భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలతోపాటు అన్నదానములో పాల్గొనాలని భక్తులను కోరుతున్నామన్నారు. అదే సమయంలో అమ్మవారికి ఎవరైనా భక్తులు కానుకలుగాని, విరాళాలు గానీ ఇవ్వాలనుకుంటే ఆలయ కమిటీని నేరుగా సంప్రదించాలని కోరుతున్నారు.