23న మరో బంగాళాఖతంలో మరో అల్పపీడనం..


Ens Balu
1
Amaravati
2020-08-20 12:35:32

బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఒడిసా ఉత్తర ప్రాంతం వద్ద కేంద్రీకృతమైందని వాతారవరణ శాఖ తెలియజేసింది. ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న వాతావరణశాఖ  వాయువ్య బంగాళాఖాతంలో ఈనెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వీటి కారణంగా గురు, శుక్రవారాల్లోనూ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విశాఖ నుంచి ప్రకాశం జిల్లా వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రోంలో ఆటుపోట్లు అధికంగా వుంటాయని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడాదని కూడా హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రభుత్వం ముందస్తుగా అన్ని కలెక్టరేట్లు, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది...