ఆ గ్రామాల్లో తారురోడ్డు వేస్తాం.ఐటిడిఏ పీఓ..
Ens Balu
2
Paderu
2020-08-20 12:51:02
పాడేరు మండలంలోని గుత్తులపుట్టు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి కుముడుపల్లి రహదారిని పూర్తిగా తారురోడ్డుగా మారుస్తామని ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల ప్రకటించారు. "అధ్వాన్నంగా కోడాపల్లి ,కుముడుపల్లి, గోమంగి రహదారి " బుధవారం మీడియాలో ప్రచురితమైన వార్తపై స్పందించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ క్లిప్పింగ్లను పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులకు పంపించి తగిన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పన్నెండు గంటల వ్యవధిలోనే రూ.2లక్షలతో మరమ్మతులు చేసి రవాణాకు అనుకూలంగా తీర్చి దిద్ది రవాణాకు అనువుగా రోడ్డును అభివృద్ధి చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పిఓ చెప్పారు. పనుల పురోగతి, తాజా పరిస్థితి తెలియజేయాలని ఆదేశించడంతో మరమ్మత్తు పనులను ఈఈ కుసుమభాస్కర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.