ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన పీఓ..


Ens Balu
3
Chinthapally Village
2021-03-08 13:56:00

చింతపల్లి మండలంలోని చౌడుపల్లి పంచాయతీ బౌర్తి ప్రభుత్వ గిరిజన సంక్షేమ  ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుల్లెల సత్యరాజును ఐ టీడీఏ  ప్రోజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల  సస్పెండ్ చేశారు. సోమవారం మండలం పర్యటనలో బాగంగా బౌర్తి పాఠశాలను తనిఖీ చేశారు. మనబడి  నాడు నేడు పనుకు తనిఖీ చేశారు.మనబడి నాడు పనులు అసంపూర్తిగా నిలిచి పోయాయి. ఉపాధ్యాయుడు రూ.5వేలు వేతనం ఇచ్చి  వాలంటీర్ ను నియమించి ఆయన విధులకు గైరు హాజరయ్యారు. 5వతరగతి విద్యార్థులు కనీసం  అ, ఆ,లు చెప్పలేకపోతున్నారని విద్యా ప్రమాణాలు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు  పాఠశాలకు వస్తున్నది లేనిది గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం పై ఆరాతీశారు. పిల్లలకు యూనిఫామ్ కట్టించాలని తలిదండ్రులకు సూచించారు.