భీమిలీలో ఓటు వేసిన మంత్రి అవంతి..
Ens Balu
2
Bheemili
2021-03-10 13:56:26
విశాఖలోని భీమిలీలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో సహా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం భీమిలీ మూడోవ వార్డ్ నెరేళ్ళ వలస కాలనీలో మంత్రి కుటుంబ సభ్యులు, 11వ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటుహక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన మంత్రి కుటుంబం అందరి మాదిరిగానే క్యూలైన్ లో నిలబడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి జ్ఞానేశ్వరి, కుమార్తె ఆరోవ వార్డు కార్పొరేటర్ అభ్యర్ది డాక్టర్ ప్రియాంక, శ్రావణ్ కుమార్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.