మత్స్యగుండం శివయ్యకు పీఓ పూజలు..
Ens Balu
2
Matsyagundam
2021-03-11 20:30:47
హుకుంపేట మండలం మత్స్య గుండం ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.సలిజాముల వెంకటేశ్వర్ పట్టు వస్త్రాలు ధరించి పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన కమిటీ సభ్యులతో మాట్లాడుతూ దూరప్రాంతాలనుంచి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంచినీరు సరఫరా చేయాలని నీటిలో దిగి స్నానాలు చేసేవారిని నిత్యం పర్యవేక్షించాలని గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని విద్యత్ కు అంతరాయం కలుగకుండా చూసుకోవాలని పిఓ ఆదేశించారు. ఈరోజు 11వ తా. నుండి 3రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.