రోడ్డుకోసం ఆదివాసీ గిరిజనుల వినూత్న నిరసన..
Ens Balu
2
Ratnampeta
2020-08-22 15:37:24
రోలుగుంట మండలం పనసలపాడు గిరిజనులు తమ గ్రామానికి రహదారి నిర్మిం చాలంటూ రోడ్డుపై మొక్కలు నాటుతూ వినూత్న నిరసన చేపట్టారు. శనివారం 15 కుటుంబాలకు చెందిన గిరిజ నులు తమ గోడు వెల్లబోసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టారు. పనసలపాడు నుండి రత్నం పేట పంచాయతీ కేంద్రానికి వెళ్లాలం టే బురదతో కూడిన ఇరుకు రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది. కనీసం 108 వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. అనారోగ్యం వస్తే డోలు తో రోగులను రోడ్డు ప్రాంతానికి మోసుకొస్తున్నామని ఆవేదన వ్య క్తం చేశారు గ్రామస్తులు. రోడ్డు వేయడానికి ఉపాది పనుల క్రింద రూ. లక్ష విడుదల చేసినా ఆ రోడ్డు మాజీ సర్పంచ్ తన జిరాయితీ భూమిలో ఉందని పనులను అడ్డుకున్నారని చెబుతున్నారు. ఈ విషయమై ఆర్డీఓకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్న గ్రామస్తులు గత్యంతరం లేక వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నామని కెవిపిఎస్ జిల్లాకార్యదర్శి చిరంజీవి చెబుతు న్నారు. తమ గ్రామానికి రోడ్డు వేసే వరకూ వివిధ రూపాల్లో ఆందోళన తప్పదని చెబుతున్నారు. కార్యక్రమంలో సిపిఎం జి కార్యవర్గ సభ్యుడు ఆదివాసీ నాయకులు చంద్ర రావు గ్రామ మహిళలు పాల్గొన్నారు.