అధికార మధం పనిచేయలేదు..సహచట్టం ఆధారాల ముందు
Ens Balu
2
Yalamanchilli
2020-08-23 14:30:09
సమాచారహక్కుచట్టం కార్యకర్త చొరవతో ప్రభుత్వం ద్వారా 84 పేద కుటుంబాలకు ఇళ్లస్థలాలు దక్కాయి.. ప్రభుత్వం పార్టీ నాయకులు తన్నీరు రాజారావుకి చుట్టమేమీ కాదని ఈవిషయంలో మరోసారి రుజువైంది. యస్.రాయవరం గ్రామంలో గుండ్రుబిల్లీ దగ్గర 3 ఎకరాలు ప్రభుత్వ భూమిని అధికారం అడ్డుపెట్టుకొని బొలిశెట్టి గోవిందరావు అండదంటలతో తమ సొంత స్థలం లాగా గేట్లు వేసి మరీ సాగు చేసుకుంటున్నారు. ఈవిషయంపై స్థానికులు అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా, అవతలి వ్యక్తులను బెదిరించి మరీ సాగుచేసుకునేవారు. ఆ విషయాన్ని సమాచారహక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు ప్రభుత్వం ద్రుష్టికి ఆధారాలతో సహా తీసుకెళ్లడంతో వాస్తవాలు తెలుసుకున్న రెవిన్యూ అధికారులు అనధికారికంగా వేసిన గేట్లను తొలగించి, ఆ భూమిని 84 కుటుంబాల పేదలకు ప్లాట్లు వేసి రిజిస్టర్ చేసింది. గ్రామంలో ఒక వ్యక్తిద్వారా జరిగిన మంచిపని ద్వారా అధికారపార్టీ నేతల భూ ఆక్రమణ వ్యవహారం బయటకు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.