విశాఖ మన్యంలో 5వేల కేసులకు చేరువలో కరోనా...
Ens Balu
3
Paderu
2020-08-23 21:15:33
విశాఖమన్యం కరోనా పాజిటివ్ కేసుల విషయంలో మైదాన ప్రాంతాలతో పోటి పడుతుంది. ఐదువేల కేసులకు చేరువలో ఏజెన్సీలోని 11 మండలాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలోఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆదివారం నాటికి 4688 పాజిటివ్ కేసులు నమోదు కాగా,య ఇందులో 328 మాత్రమే కోలుకున్నారు. కోవిడ్ కేంద్రంలో 685 మంది చికిత్సలు పొందుతున్నారు. నిత్యం ఏదో చోట కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా, కరోనా మాత్రం గిరిపుత్రులను వెంటాడుతూనే వుంది. మరోవైపు మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు ఈ కరోనా వైరస్ ప్రభావంపై అవగాహన కల్పించాల్సిన అవరముందని వక్తలు అభిప్రాయ పడుతున్నారు. వారిలో అవగాహన తీసుకువస్తే తప్పా, ఏజెన్సీ గ్రామాల్లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేటట్టు కనిపించడంలేదు...