శంఖవరంలో ఒకే రోజు 39 కరోనా పాజిటివ్ కేసులు...
Ens Balu
2
తూర్పుగోదావరి జిల్లా
2020-08-25 18:31:50
శంఖవరం మండలకేంద్రంలో ఈ ఒక్కరోజే అత్యధికంగా39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 100 మందికి స్వాబ్ ర్యాపిడ్ టెస్టులు చేయగా అందులో 39 పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖవరంలో విపరీతంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలాఅప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.