ఏజెన్సీ ఆసుపత్రులకు ఐటిపిఓ వైద్యపరికరాల వితరణ
Ens Balu
2
Paderu
2020-08-26 17:48:56
ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ( ఐ.టి.పి.ఒ.) న్యూఢిల్లీ అండర్ సి.యస్.ఆర్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్స్ క్రింద 18 బేబీ వార్మర్స్, ఒక ఫొటో థెరపీ యూనిట్, నెబులైజర్స్-24 ఇతర వైద్య పరికరాలు అందజేశారని పాడేరు ఐటిడిఏ పిఓ డా.వెంకటేశ్వర్ సలిజామల తెలియజేశారు. బుధవారం వీటిని ఆసుపత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, వర్షాకాలం, శీతాకాలంలో వాతావరణం చల్లగా వుండటం వల్ల మరియు బరువు తక్కవతో జన్మించిన పిల్లల కు శరీర ఉష్ణోగ్రత తక్కువ వుంటుందని, వాళ్లకి హైపోథెర్మియా నుంచి రక్షించడానికి, టెంపరేచర్ రెగ్యులరైజ్ చెయ్యడానికి ఇది ఉపయోగపడుతుందని, పచ్చకామెర్లతో యున్న పిల్లలకు ఫొటో థెర్మియా ట్రీట్మెంట్ కి ఈ పరికరాలను వినియోగిస్తారని తెలిపారు. అలాగే నెబులైజర్స్ ఆస్త్మా రోగులకు, ఆయాసం అధికంగా వున్న రోగులకు ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఊపిరి తిత్తుల సమస్యలో ఈ పరికరం బాగా ఉపయోగపడుతుందని ఈవిషయాలన్ని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వరప్రసాద్ ఈ సమావేశంలో తెలిపారు. కార్యక్రమం లో డాక్టర్ ప్రవీణ్ వర్మ , ఏజెన్సీ లోని పి.హెచ్. సి. డాక్టర్ లు మిగతావైద్య సిబ్బంది మరియు ఐటీడీఏ. ఏ.పి.ఓ.(జనరల్)ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.